Wednesday, September 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్వామ్మో మళ్లీ.. పులి

వామ్మో మళ్లీ.. పులి

మల్హర్ మండలంలో మళ్ళీ పులి సంచారం?
స్పాట్ వాయిస్,మల్హర్ :మండలంలోని మళ్ళీ పులి సంచారం కలకలం రేపుతోంది. గత రెండు నెలల క్రితం కనిపించిన పులి మళ్ళీ తాజాగా మండలంలోని ఎడ్ల పల్లి పంచాయతి పరిధి లోని బొగ్గుల వాగు ప్రాజెక్ట్ వద్ద పులి సంచరించినట్టు శుక్రవారం గ్రామస్థులు తెలిపారు. పులి సంచరించిన ప్రాంతంలో పాద ముద్రలు గుర్తించి గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి సంచారం తో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన రెండు పశువుల పై కూడా దాడి చేసినట్టు గ్రామస్థులు తెలుపుతున్నారు.అటవీ అధికారులు పులి సంచరించిన ప్రాంతానికి వెళ్లి పులి పాద ముద్రలు సేకరిస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments