Saturday, June 7, 2025
Homeక్రైమ్ముగ్గురిని మింగిన పిడుగు

ముగ్గురిని మింగిన పిడుగు

మహబూబాబూద్ జిల్లాలో విషాదం..
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: మానుకోట జిల్లాలో విషాదం నెలకొంది. మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కురవి మండలం జగ్యాతండాలో మిరపతోటలో భూక్య హుస్సేన్ (42) నాగలి దున్నుతున్నాడు ఈ క్రమంలో పిడుగు పడడంతో పంటచేనులోనే విఘతజీవిగా పడిపోయాడు. అలాగే బయ్యారంలోయువకుడు పిడుగు పాటుకు మృత్యువాత పడ్డాడు. పెద్దచెరువు కట్టపై పశువులు మేపుతుండగా.. పిడుగుపడి కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే గూడూరు మండలం లక్ష్మీపురంలో పిడుగుపడి పంటచేలో పనిచేసుకుంటున్న మల్సూర్ ప్రాణాలొదిలాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments