Sunday, April 20, 2025
Homeక్రైమ్ముగ్గురు పిల్లలతో కలిసి మిడ్ మానేరులో దూకిన తల్లి

ముగ్గురు పిల్లలతో కలిసి మిడ్ మానేరులో దూకిన తల్లి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం
స్పాట్ వాయిస్, క్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఏ కష్టం వచ్చిందో గానీ.. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బోయినపల్లి మండలంలో శభాష్‌పల్లి వంతెన వద్ద మిడ్‌ మానేరు జలాశయంలో దూకి ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య చేసుకున్నది. మృతుల్లో నాలుగు నెలల పసికందు కూడా ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments