Wednesday, May 21, 2025
Homeతెలంగాణతల్లికి మద్యం తాగించి.. బిడ్డను ఎత్తుకెళ్లారు..

తల్లికి మద్యం తాగించి.. బిడ్డను ఎత్తుకెళ్లారు..

వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఘటన
స్పాట్ వాయిస్, వేములవాడ: సిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయం వద్ద 28 రోజుల బాబు అపహరణకు గురయ్యాడు. కరీంనగర్‌ పట్టణం శాంతినగర్ కు చెందిన లావణ్య అనే మహిళ 4 రోజులుగా ఇద్దరు పిల్లలతో ఆలయం మెట్ల వద్ద ఉంటోంది. కుటుంబ కలహాలతో లావణ్యను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. అయితే లావణ్య ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగలు.. ఆదివారం రాత్రి ఆమెకు మద్యం తాగించారు. నింద్రలోకి జారుకోగానే బాబును ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాబు ఆచూకీ కోసం అక్కడున్న సీసీటీవీ ఫుటేజీల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments