Monday, September 23, 2024
Homeక్రైమ్ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి

ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి

పరశురాంపల్లి గ్రామంలో దుర్ఘటన
స్పాట్ వాయిస్, గణపురం: ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి చెందిన విషాద ఘటన మంగళవారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పరుశురాంపల్లి గ్రామానికి చెందిన ఉడుత రాజు (35)కు సొంత ట్రాక్టర్‌ ఉంది. దీనికి ఆయనే డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడైనా పొలం పనులు, తదితర పనులు ఉంటే ఆయన అక్కడికి వెళ్లి పని పూర్తి చేసుకుని వస్తుంటారు. కాగా తన ఇంటి అవసరం కోసం ఓసీ త్రీ సమీపంలోని వొర్రె నుంచి మట్టిని తరలిస్తున్నాడు. రెండు ట్రిప్పులు పూర్తిచేసుకుని, మూడో ట్రిప్పులో మట్టిని లోడు చేసుకొని గడ్డకు వస్తున్న క్రమంలో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి తిరగబడింది. దీంతో రాజు ట్రాక్టర్ లో ఇరుక్కుపోయాడు. అక్కడే ఉన్న కొందరు ప్రమాదాన్ని గమనించి ప్రోక్లైనర్ సాయంతో బయటకి తీసి 108లో ములుగు సివిల్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో రాజు మృతి చెందాడు. మృతుడికి భార్య హైమ ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments