Saturday, May 24, 2025
Homeక్రైమ్బైక్ ను ఢీకొన్న కారు..

బైక్ ను ఢీకొన్న కారు..

తండ్రీ కూతురు మృతి.. అల్లుడికి గాయాలు..
పండుగ పూట విషాదం..

 స్పాట్ వాయిస్, వర్ధన్నపేట : పండుగ పూట విషాదం నెలకొంది. దసరాకు కూతురు, అల్లుడిని పిలిచి పండుగ చేసుకుందామని అనుకున్న ఓ కుటుంబంలో రోడ్డు ప్రమాదం చీకట్లు నింపింది. అత్తారింటి నుంచి కూతురు, అల్లుడిని తండ్రి బైక్‌పై తీసుకెళ్తున్న క్రమంలో ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకూతుళ్లు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. అల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలకు చెందిన వెంకన్న.. కూతురు అనూష, అల్లుడు రాజేశ్‌ను దసరాకు ఇంటికి తీసుకురావడానికి వెళ్లాడు. శనివారం సాయంత్రం కూతురు ఇంటికి వెళ్లాడు. కూతురు, అల్లుడిని వెంటబెట్టుకుని రాత్రి సమయంలో బైక్‌పై బయల్దేరాడు. ఈ క్రమంలో కిష్టాపురం సమీపానికి రాగానే వాళ్ల బైక్‌ను ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్న, అనూష అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రాజేశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు రాజేశ్‌ను హుటాహుటిన దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments