Friday, September 20, 2024
Homeకెరీర్టెట్ రాసేందుకూ వాళ్లూ అర్హులే..

టెట్ రాసేందుకూ వాళ్లూ అర్హులే..

రేపటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ
దరఖాస్తు రుసుం రూ.300
బీఎడీ, డీఎడీ లాస్ట్ ఇయర్‌కు చాన్స్
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: టెట్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ శనివారం నుంచి మొదలు కానుంది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 12వ తేదీ వ‌ర‌కు దరఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు. పేప‌ర్ 1, పేప‌ర్ 2కు క‌లిసి ద‌ర‌ఖాస్తు రుసుమును రూ. 300గా నిర్ణయించారు. ఒక పేప‌ర్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఇదే రుసుం వ‌ర్తించ‌నుంది. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసేట‌ప్పుడు అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, స్టేట్‌, మొబైల్ నంబ‌ర్ త‌ప్పనిస‌రిగా ఎంటర్ చేయాలి. ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆన్‌లైన్ పేమెంట్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
బీఈడీ, డీఈడీ లాస్ట్ ఇయర్ కు చాన్స్
బీఈడీ, డీఈడీ చ‌దువుతున్న చివ‌రి సంవ‌త్సరం విద్యార్థులు సైతం టెట్ రాసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. 2017 టెట్ సిల‌బ‌స్ ప్రకార‌మే ఈ సారి ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. హెల్ప్ డెస్క్ సేవ‌లు మార్చి 26 నుంచి జూన్ 12వ తేదీ వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి.
జూన్ 6 నుంచి హాల్ టికెట్లు..
జూన్ 12న టెట్ నిర్వహించి, 27న ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్నారు. జూన్ 6 నుంచి టెట్ హాల్ టికెట్స్‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. tstet.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో టెట్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను పొందుప‌రిచారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments