Friday, September 27, 2024
Homeక్రైమ్ఛీ..ఛీ.. టీచర్

ఛీ..ఛీ.. టీచర్

విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన
చితకబాదిన తల్లిదండ్రులు
అదుపులోకి తీసుకున్న పోలీసులు
వరంగల్ ఎల్బీనగర్ లో ఘటన
స్పాట్ వాయిస్, వరంగల్: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని తల్లిదండ్రులు చితకబాదారు. ఈ ఘటన వరంగల్ జిల్లా కేంద్రం ఎల్బీనగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఎల్బీనగర్​లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మనోహర్ అనే ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్రం బోధిస్తున్నాడు. అతడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో వారు తల్లిదండ్రులకు చెప్పారు. దీనిపై మనోహర్ ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. అయితే ఎలాంటి ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులే రంగంలోకి దిగారు. పాఠశాలలోనే ఉపాధ్యాయుడిని చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మనోహర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయంపై ప్రధానోపాధ్యాయునికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే మొదటి తప్పిదంగా భావించి మన్నించాలని తల్లిదండ్రులకు చెప్పడం గమనార్హం. పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన మనోహర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments