Sunday, June 8, 2025
Homeక్రైమ్తమ్మినేని హత్య కేసులో ఆరుగురి అరెస్ట్..

తమ్మినేని హత్య కేసులో ఆరుగురి అరెస్ట్..

తమ్మినేని హత్య కేసులో ఆరుగురి అరెస్ట్..

స్పాట్ వాయిస్ , క్రైం: టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. కృష్ణయ్యను హతమార్చిన ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం తెల్లవారుజామున వీరిని ఆంధ్రప్రదేశ్‌లో అదుపులోకి తీసుకుని ఖమ్మంకు తరలిస్తున్నారు. కాగా, ప్రధాన నిందితులైన తమ్మినేని కోటేశ్వరరావు, జక్కంపూడి కృష్ణ అనే నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. అరెస్టయిన వారిలో ఏ2 రంజాన్‌, ఏ4 గంజి స్వామి, ఏ5 నూకల లింగయ్య, ఏ6 బోడపట్ల శ్రీను, ఏ7 నాగేశ్వరరావు, ఏ8 ఎల్లంపల్లి నాగయ్య ఉన్నారు. వారివద్ద హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments