Monday, April 14, 2025
Homeక్రైమ్అత్తామామలు డైరీ చదివారని యువతి ఆత్మహత్య

అత్తామామలు డైరీ చదివారని యువతి ఆత్మహత్య

స్పాట్ వాయిస్, డెస్క్: అత్తమామలు తన డైరీని చదివారని యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్​పుర్​లోని సావనేర్ పోలీసు స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిఖిత డహట్​​ అనే యువతి తన మామ ఇంట్లో ఉంటోంది. ఆమె రోజు డైరీ రాసుకునేది. ఎవరికీ చెప్పలేని విషయాలన్నీ ఇందులో రాసుకునేది. ఆమె మామ రత్నాకర్, అత్త మంగళ నిఖిత డైరీని దొంగిలించి చదివారు. రత్నాకర్, మంగళ రహస్యంగా అయితే అందులో తన అత్త ‘దెయ్యం’ అని నిఖిత రాసింది. దీంతో.. నిఖిత బంధువులను పిలిచి తన గురించి దెయ్యం అని డైరీలో రాసిందంటూ మందలించారు. ఎందుకు అలా రాసావో చెప్పాలని బంధువులందరి ముందు నిలదీశారు. దీంతో నిఖిత ఒత్తిడికిలోనై ఉరివేసుకుంది. దీంతో మృతురాలి సోదరుడు పంకజ్ దీనికి బాధ్యులైన మామ రత్నాకర్, అత్త మంగళపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments