Monday, September 23, 2024
Homeక్రైమ్ఇద్దరి ఆత్మహత్య

ఇద్దరి ఆత్మహత్య

చెరువులో దూకి ఇద్దరి ఆత్మహత్య
స్పాట్ వాయిస్, వరంగల్ : హన్మకొండ జిల్లా పైడిపెల్లి పరిధిలోని మద్యగూడెం చెందిన తిక్క అంజలి (25), సంగాల దిలీప్ (30) వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని రాంచంద్రుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దిలీప్ కు నెక్కొండ మండలం జంజరపల్లికి చెందిన ఓ యువతితో వివాహం అయిందని, వారికి ఇద్దరు పిల్లలున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఏసీపీ నర్సయ్య సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చెరువు గట్టుపై ఓ పల్సర్ బైక్ ఉందని, అలాగే అంజలికి చెందిన హ్యాండ్ బ్యాగ్ పోలీసులకు లభ్యం అయింది. అయితే వివాహేతర సంబంధం కుటుంబసభ్యులకు తెలియడంతో ఆందోళనకు గురై వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments