Sunday, May 25, 2025
Homeక్రైమ్ఇన్విజిలేటర్ కొట్టాడని.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య 

ఇన్విజిలేటర్ కొట్టాడని.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య 

ఇన్విజిలేటర్ కొట్టాడని..

డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య 

ఇన్విజిలేటర్ కొట్టాడని విద్యార్థి బంధువుల ఆరోపణ

బాలాజీ మహిళా డిగ్రీ కళాశాల ఎదుట ఆందోళన

స్పాట్ వాయిస్, నర్సంపేట : డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సంపేటలో చర్చనీయాంశమైంది. ఇన్విజిలేటర్ కొట్టడంతోనే విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ శుక్రవారం బాలాజీ మహిళా డిగ్రీ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఖానాపురం మండలం రాగంపేట గ్రామానికి చెందిన భూక్యా సాయికుమార్ నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడు పట్టణంలోని బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎగ్జామ్స్ సెంటర్ లో సెమిస్టర్ పరీక్షలకు హాజరువుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం విద్యార్థి పరీక్ష రాస్తుండగా మాస్ కాపీయింగ్ చేస్తున్నాడన్న కారణంతో ఇన్విజిలేటర్ కొట్టాడని దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి చింతలపల్లి-వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య వంచనగిరి రైల్వే గేట్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కాగా, సాయికుమార్ మృతదేహంతో కళాశాల వద్ద ఆందోళన నిర్వహించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments