Friday, September 20, 2024
Homeక్రైమ్దశాబ్ది ఉత్సవాలకు విద్యార్థి బలి..

దశాబ్ది ఉత్సవాలకు విద్యార్థి బలి..

బ్రేకింగ్ న్యూస్..

 

దశాబ్ది ఉత్సవాలకు విద్యార్థి బలి..

 

కమలాపూర్ మండలంలో విషాదం

విద్యా పండుగా ర్యాలీ తీస్తుండగా ఘటన..

స్పాట్ వాయిస్, కమలాపూర్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో విద్యార్థి బలి అయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. విద్యా పండుగ వేడుకల్లో భాగంగా మంగళవారం కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ర్యాలీ తీస్తుండగా ట్రాక్టర్ కింద పడి 6వ తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్(10)మృతి చెందాడు. అయితే ర్యాలీ తీస్తుండగా ధనుష్ కిరాణం దుకాణం లోకి వెళ్లి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటున్నాడని.. ఈ క్రమంలో బాలుడిని కుక్కలు కరిచేందుకు యత్నించాయి. దీంతోతప్పించుకునే ప్రయత్నంలో విద్యార్థి ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. ధనుష్ స్థానిక ప్రాథమిక పాఠశాలలో 5 వ తరగతి పూర్తి చేసి ఈ విద్యా సంవత్సరం 6 వ తరగతిలో ప్రవేశం కోసం హైస్కూల్ కు వెళ్ళాడు.. ఈ క్రమంలో విద్యార్థి మృతి చెందడంతోతల్లిదండ్రులు జయపాల్ స్వప్న కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.అయితేపాఠశాల నిర్వహకుల నిర్లక్ష్యమే విద్యార్థి ప్రాణం తీసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.పాఠశాల నిర్వాహకులు, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments