Friday, September 20, 2024
Homeక్రైమ్ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

స్పాట్ వాయిస్, క్రైమ్: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన హన్మకొండ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన మురారి శెట్టి నాగజ్యోతి హన్మకొండ నక్కలగుట్టలోని సు విద్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. బుధవారం ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరై కళాశాల హాస్టల్ కు చేరుకుంది. రాత్రి 9గంటలకు ఉరి వేసుకోగా తోటి మిత్రులు గమనించి కళాశాల యాజమాన్యంకు సమాచారం ఇచ్చారు. వెంటనే నగరంలోని లైఫ్ లైన్ ఆసుపత్రి కి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం లైఫ్ లైన్ నుంచి ఎంజీఎం ఆసుపత్రి కీ తీసుకొని పోయారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments