Saturday, September 21, 2024
Homeజాతీయంఈటల కాన్వాయ్ పై రాళ్లదాడి

ఈటల కాన్వాయ్ పై రాళ్లదాడి

ఈటల కాన్వాయ్ పై రాళ్లదాడి
బీజేపీ, టీఆర్ ఎస్ బాహాబాహీ
మునుగోడులో తీవ్ర ఉద్రిక్తత
స్పాట్ వాయిస్, మునుగోడు : మునుగోడు నియోజకవర్గ పరిధి పలివెలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్ ఎస్ శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో బీజేపీ తరఫున ప్రచారానికి వచ్చిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. పలివెలలో ఓ వైపు ఆయా పార్టీలు ప్రచారం చేసుకుంటుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అలాగే ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్​తో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోనే రాళ్ల దాడి జరిగిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. పల్లానే దగ్గరుండే తమపై దాడి చేయించారని అన్నారు. ఘటన జరిగిన సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఈటల మండి పడ్డారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments