సీతారామస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి
ఎమ్మెల్సీ సిరికొండ మధుసుదనాచారి
ఆలయంలో ప్రత్యేక పూజలు
స్పాట్ వాయిస్, గణపురం:సీతారామచంద్రస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని తెలంగాణ తొలి శాసనసభాపతి, శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సితారామస్వామి ఆలయంలో శ్రీరామనవమిని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చివరి రోజున నిర్వహిస్తున్న నాగబెల్లి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ…లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలు కోర్చిన సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించాలని ఆకాంక్షించారు. అనంతరం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బైరగాని కుమారస్వామి, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి, రత్నం రవి, డాక్టర్ జన్నయ్య, కట్ల శంకరయ్య, బత్తిని శంకర్, తంగెళ్లపెల్లి వెంకట్, పులిగిల్ల సమ్మయ్య, పాశికంటి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments