Tuesday, September 24, 2024
Homeతెలంగాణస్పాట్ ఫ్లాష్..

స్పాట్ ఫ్లాష్..

సీఎం కేసీఆర్ సతీమణికి స్వల్ప అస్వస్థత
కాసేపట్లో యశోద ఆస్పత్రికి వెళ్లనున్న సీఎం
స్పాట్ వాయిస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సతీమణి శోభ అనారోగ్య కారణాలతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా ఆమె మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ నొప్పి తీవ్రం కావడంతో ఆదివారం సాయంత్రం సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో కుటుంబ సభ్యులు చేర్చారు. అయితే నొప్పి ఎక్కువ కావడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. సీఎం కుటుంబసభ్యుల అంగీకారంతో శోభకు యశోద ఆస్పత్రి డాక్టర్లు మోకాలి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం శోభ స్వల్ప అస్వస్థతతో ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. శోభను పరామర్శించేందుకు కాసేపట్లో కేసీఆర్ యశోద ఆస్పత్రికి వెళ్లనున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments