Friday, September 20, 2024
Homeక్రైమ్మావోయిస్టులకు బిగ్ షాక్..

మావోయిస్టులకు బిగ్ షాక్..

మావోయిస్టులకు బిగ్ షాక్..
లొంగి పోయిన సావిత్రి..!

స్పాట్ వాయిస్ , డెస్క్: మావోయిస్టులకు భారీ షాక్‌ తగిలింది. మావోయిస్ట్ సావిత్రి లొంగిపోయింది. ఆమె మావోయిస్టు దండకారణ్య కమిటీ సెక్రెటరీ రామన్న భార్య. 2019లో ఛత్తీస్‌గఢ్‌ అడువుల్లో రామన్న గుండెపోటుతో మృతి చెందాడు. రామన్నపై గతంలో పోలీసులు రూ.40లక్షల రివార్డును ప్రకటించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఝార్కండ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌గా రామన్న ఉన్నాడు. 1994లో దళ సభ్యురాలు సావిత్రిని రామన్న పెళ్లి చేసుకున్నాడు. సావిత్రి కుమారుడు రంజిత్‌ గతేడాది పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత సావిత్రి సైతం మావోయిస్ట్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తోంది. లొంగుపాటుపై పోలీసులు ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments