Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలుసీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఎంపీపీ ఓలం చంద్రమోహన్

స్పాట్ వాయిస్, కేసముద్రం: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కేసముద్రం ఎంపీపీ ఓలం చంద్రమోహన్ అన్నారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చంద్రమోహన్ అధ్యక్షతన వివిధ గ్రామాల సర్పంచులకు, కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చంద్రమోహన్ మాట్లాడుతూ… సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెలాఖరు వరకు ఫీవర్ సర్వే పూర్తి చేయాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని, నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ వేయాలని పేర్కొన్నారు. తాగునీటి పైప్ లైన్ లీకేజీలను వెంటనే రిపేర్ చేయించాలని, మంచి నీటిని వేడిచేసి చల్లార్చి తాగాలని సూచించారు. అలాగే మన ఊరు- మన బడి పనులను వేగవంతం చేసి ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రోజారాణి,డాక్టర్ పవన్, దేవేందర్,ఎంపీఓ రఘుపతి రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు,కార్యదర్శులు,ఆశలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments