Thursday, April 17, 2025
Homeక్రైమ్గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, సింగర్ సాయిచంద్ మృతి

గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, సింగర్ సాయిచంద్ మృతి

గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్,
సింగర్ సాయిచంద్ మృతి

స్పాట్ వాయిస్, డెస్క్: ప్రముఖ సింగర్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) బుధవారం తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. బుధవారం కుటుంబంతో కలిసి నాగల్ కర్నూల్ జిల్లా కారుకొండలో తన ఫామ్ హౌస్ కి వచ్చిన ఆయన.. రాత్రి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే అతడిని నాగర్ కర్నూల్ లోని హాస్పటిల్ కి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గచ్చిబౌలి లోని కేర్ హాస్పటిల్ కి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ అతడు మరణించాడు. కాగా సాయి చంద్ తెలంగాణ ఉద్యమ కళాకారుడిగా, గాయకుడిగా ప్రసిద్ధి చెందారు.
సాయిచంద్‌ మృతిపట్ల బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments