Thursday, April 17, 2025
Homeక్రైమ్అన్నంలో పురుగుల మందు..

అన్నంలో పురుగుల మందు..

అన్నంలో పురుగుల మందు..
విచారణ జరుపుతున్న పోలీసులు..

స్పాట్ వాయిస్ , సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలంలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని గవిచర్లకు చెందిన యాదగిరి అనే వ్యక్తి తమకు కూలి పనికి రాకుండా వేరే వారి వద్దకు పనికి వెళ్లిందన్న కోపంతో సదరు యువతి మధ్యాహ్నం తినే భోజనంలో పురుగుల మందు కలిపాడు. ఆహారం తినే సమయంలో వాసన వస్తుండడంతో ఆ యువతి యాదగిరిని నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరికి తీవ్ర వాగ్వాదం జరగగా ఆ యువతి తనను చంపేందుకు ప్రయత్నించాడని, కులం పేరుతో దూషించాడని సంగెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మామునూరు ఏసీపీ ఘటన స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. గ్రామస్తుల వాగ్మూలంతో యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాదగిరిపై హత్యాయత్నం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బాధితురాలికి, యాదగిరికి ఆరేళ్లుగా పరిచయం ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments