Saturday, September 21, 2024
Homeక్రైమ్రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
-గణపురం వాసిగా గుర్తింపు
స్పాట్ వాయిస్, గణపురం: జనగామ జిల్లా రఘునాథ్ పల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన  ఘటన బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. మృతుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన పాసికంటి శివ గా గుర్తించారు. స్టేషన్ ఘన్ పూర్ లోని  సమీప బంధువు ఇంటికి వెళ్లిన శివ రైల్వే పట్టాలపై మృతి చెంది ఉండడం పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఊరికి వెళ్లి వస్తానని చెప్పిన కొడుకు విఘత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  శివ ఆత్మహత్య చేసుకున్నాడా.. మరి ఏదైనా కారణంతో హత్యకు గురయ్యాడా పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments