Wednesday, May 21, 2025
Homeజిల్లా వార్తలుపేకాట ఆడుతున్న ఆరుగురి అరెస్ట్..

పేకాట ఆడుతున్న ఆరుగురి అరెస్ట్..

స్పాట్ వాయిస్, గణపురం: పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం ఎస్సై ఆర్ అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు చెల్పూరు గ్రామపంచాయతీ పరిధిలోని వీరయ్య పల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం వచ్చింది. దీంతో సిబ్బందితో వెల్లి దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆరుగురిని పట్టుకొని వారి నుంచి 52 పేక ముక్కలు, రూ. 1300, మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న పొనుగంటి ప్రశాంత్, కన్నూరి ప్రశాంత్, బీరెల్లి విలాస్, ఆముదాల సతీష్, పెరుక స్నాగపాణి,, గడ్డం సారంగపాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments