Friday, September 20, 2024
Homeతెలంగాణమొన్న 9 మంది.. ఇయ్యాల ఆరుగురు..

మొన్న 9 మంది.. ఇయ్యాల ఆరుగురు..

మావోలకు భారీ దెబ్బ..
మళ్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్
స్పాట్ వాయిస్, క్రైమ్: మళ్లీ తుపాకుల మోత మోగింది. పచ్చని అడవులు రక్తంతో తడిసిపోయాయి. రెండు రోజుల క్రితం గా ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో మంగళవారం ఎన్ కౌంటర్ కాగా..9 మంది మావోలు హతమయ్యారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు ఎదురుపడిన మావోయిస్టులు.. కాల్పులు జరిపారు. దీంతో ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల మరణించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments