Tuesday, September 24, 2024
Homeతెలంగాణరాజగోపాల్‌రెడ్డిని ఓడించండి..

రాజగోపాల్‌రెడ్డిని ఓడించండి..

రాజగోపాల్‌రెడ్డిని ఓడించండి
తెలంగాణ తొలి స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి
స్పాట్ వాయిస్ , హైదరాబాద్: నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించాలని తెలంగాణ తొలి స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం మునుగోడు నియోజవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ నేత కంచర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిరికొండ మధుసూదనాచారి మా ట్లాడుతూ.. మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాన్ని పట్టి పీడించిన ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించిన నాయకుడు కేసీఆర్‌ అని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments