Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్

సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్

దసరా కానుక ప్రకటన …  లాభాల్లో 30శాత వాటా
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్: సింగ‌రేణి ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ ద‌స‌రా కానుక ప్రక‌టించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ద‌స‌రా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగుల‌కు చెల్లించాల‌ని సీఎం ఆదేశించారు. అర్హులైన కార్మికుల‌కు రూ. 368 కోట్లను సింగ‌రేణి సంస్థ చెల్లించ‌నుంది. సింగరేణి కాలరీస్ సంస్థ, 2021 -22 సంవత్సరంలో సాధించిన లాభాల్లో 30 శాతం వాటా సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్​ను ఆదేశించారు. ఈ మేరకు సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా, అర్హులైన కార్మికులకు రూ. 368 కోట్లు సింగరేణి సంస్థ చెల్లించనున్నది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments