Monday, May 26, 2025
Homeలేటెస్ట్ న్యూస్కమిషనరేట్ పరిధిలో ఎస్సై సస్పెన్షన్.. 

కమిషనరేట్ పరిధిలో ఎస్సై సస్పెన్షన్.. 

ఎస్సై వీరేందర్ సస్పెన్షన్.. 

ఉత్తర్వులు జారీ చేసిన సీపీ రంగనాథ్

భూవివాదమే కారణమని నిర్ధారణ..

స్పాట్ వాయిస్, హన్మకొండ క్రైమ్: వ్యవసాయ భూవివాదంలో నిందితుడికి సహకరించినందుకు గతంలో రఘునాథపల్లి ఎస్సైగా పనిచేసిన ఎన్ వీరేందర్ ను వీఆర్ కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా, సదరు వివాదంపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు తాజాగా రిపోర్టు ఆధారంగా ఎస్సై వీరేందర్ ను సస్పెండ్ చేస్తున్నట్టు సీపీ ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి..

ఎస్సై ఎన్.వీరేందర్ గతంలో రఘునాథపల్లిలో పనిచేస్తున్న కాలంలో ఓ భూవివాదంలో నిందితుడికి సహకరించినట్టు సీపీ వీఆర్ కు అటాచ్ చేశారు. అనంతరం సదరు వివాదంపై విచారణ చేపట్టిన సందర్భంగా ఎస్సై విచారణ అధికారులకు సహకరించకపోవడమే కాకుండా, ఎస్సై నిందితుడికి సహరిస్తూ, బాధితుల్ని ఇబ్బందులు గురి చేసినందునట్లుగా నిర్ధారణ అయింది. దీంతో ఎస్సై వీరేందర్ ను సస్పెండ్ చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments