Friday, September 20, 2024
Homeక్రైమ్లైoగిక దాడికి పాల్పడిన ఎస్సై పై కేసు..

లైoగిక దాడికి పాల్పడిన ఎస్సై పై కేసు..

లైoగిక దాడికి పాల్పడిన ఎస్సై పై కేసు..

అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం

స్పాట్ వాయిస్ , క్రైమ్ : జయశంకర్ భూపాలపల్లి కాటారం పోలీస్ డివిజన్ లో కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ పై కేసు నమోదు చేసారు. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళ కానిస్టేబుల్ ను వేధింపులు గురి చేసినట్లు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో.. విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. చర్యలు తీసుకున్నరు. ఎస్ఐ భవాని సేన్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న ట్లు సమాచారo.

*కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో నిన్న రాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐల విచారణ 

*విచారణలో ముగ్గురు మహిళ కానిస్టేబుళ్లను వేధించినట్టు నిర్దారణ 

*లైంగిక వేధింపులు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు 

* ఎస్సై సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్న డిఎస్పీ 

*గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో సస్పెన్షన్ వేటు వేసిన ఉన్నతాధికారులు

 

కానిస్టేబుల్ పై ఎస్సై లైoగిక దాడి..

భూపాలపల్లి ఎస్పీ పరిధిలో ఘటన..

స్పాట్ వాయిస్ , క్రైమ్: మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవాని సేన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్‌ ను బెదిరించి వరుసగా లైoగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. ఎవరికైనా ఈ విషయం చెప్తే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. సదరు మహిళ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐల ఆధ్వర్యంలో ఎస్సై లైంగిక వేధింపులపై విచారణ జరిగినట్టు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments