తరలిరావాలన్న టీపీసీసీ చీఫ్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్రంలోని సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ చేపట్టిన నిరసనను సీఎం కేసీఆర్ పోలీసులతో అడ్డుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు అనుమతితో సోమవారం ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ధర్నాకు సర్పంచ్లు తరలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు. సర్పంచుల హక్కుల కోసం నిరసన గళం వినిపిద్దామని చెప్పారు. ప్రభుత్వం దిగివచ్చేలా పోరాటం చేద్దామని ట్వీట్ చేశారు. రేపు ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాంగ్రెస్ ధర్నా చేపట్టనున్నారు.
సోమవారం సర్పంచుల ధర్నా..
RELATED ARTICLES
Recent Comments