Saturday, September 21, 2024
Homeరాజకీయంసోమవారం సర్పంచుల ధర్నా..

సోమవారం సర్పంచుల ధర్నా..

తరలిరావాలన్న టీపీసీసీ చీఫ్
 స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్రంలోని సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ చేపట్టిన నిరసనను సీఎం కేసీఆర్ పోలీసులతో అడ్డుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు అనుమతితో సోమవారం ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ధర్నాకు సర్పంచ్‭లు తరలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు. సర్పంచుల హక్కుల కోసం నిరసన గళం వినిపిద్దామని చెప్పారు. ప్రభుత్వం దిగివచ్చేలా పోరాటం చేద్దామని ట్వీట్ చేశారు. రేపు ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాంగ్రెస్ ధర్నా చేపట్టనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments