Thursday, September 19, 2024
Homeక్రైమ్సెల్ఫీ సోకు.. కరెంటు షాక్

సెల్ఫీ సోకు.. కరెంటు షాక్

హై టెన్షన్ వైర్లు తగిలి యువకుడికి గాయలు
70 శాతం కాలిన యువకుడు..
ఆసుపత్రికి తరలింపు..
స్పాట్ వాయిస్, కాజీపేట: సరదాగా తోటి మిత్రులతో కలిసి సెల్ఫీ దిగుతూ హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, అంబులెన్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ గాంధీనగర్ కు చెందిన రాజు (18) తన తల్లితో కలిసి కాజీపేట మండలం కడిపికొండలోని చర్చిలో ఉత్సవాల నిమిత్తం ప్రార్థన కోసం వచ్చారు. ఈ క్రమంలో రాజు తోటి మిత్రులతో కలిసి కాజీపేట రామ్ నగర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ, రీల్స్ కోసం ప్రయత్నం చేస్తుండగా రైలుపై ఉన్న హై టెన్షన్ కరెంట్ వైర్లు తాగి విద్యుత్ షాక్ గురై కింద పడిపోయాడు. దీంతో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే విషయాన్ని గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని 70 శాతం కాలిపోయి ఉన్న యువకుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లింగాల శివకుమార్, పైలెట్ కుంట రవి తెలిపారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments