Tuesday, June 3, 2025
Homeలేటెస్ట్ న్యూస్బడికి పోలేక.. కిడ్నాప్ కథ.. 

బడికి పోలేక.. కిడ్నాప్ కథ.. 

బడికి పోలేక.. కిడ్నాప్ కథ.. 

విద్యార్థిని కిడ్నాప్ కట్టు కథ…

 స్పాట్ వాయిస్, బయ్యారం: బడికి వెళ్లడం ఇష్టం లేని విద్యార్థిని కిడ్నాప్ చేశారంటూ కట్టు కథతో అందర్నీ కంగారు పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. బయ్యారం మండలంలోని జగ్గు తండాకు చెందిన 11 ఏళ్ల బాలిక బయ్యారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. శనివారం బడికి వెళ్లడం ఇష్టం లేదంటూ ఇంట్లో మారం చేస్తే తల్లిదండ్రులు నచ్చజెప్పి అక్కతో సైకిల్ పై పాఠశాలకు పంపించారు. కొద్ది దూరం వచ్చిన తర్వాత అక్కతో నేను స్కూల్ కి వెళ్తాను నువ్వు ఇంటికి వెళ్ళు ..అని వెనక్కు పంపించింది. ఈ క్రమంలోనే కాకతీయ నగర్ వద్దకు వెళ్లగానే బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడని స్థానికులతో చెప్పడంతో.. విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికుల సమాచారంతో పోలీసులు వివరాలు తెలుసుకొని విచారణ ప్రారంభించగా బాలిక చెప్పిన కథ విని ఆశ్చర్యానికి.. గురయ్యారు. కిడ్నాప్ సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తల్లిదండ్రుల సమక్షంలో ఎస్సై ఉపేందర్ బాలికను ప్రశ్నించారు. బడికి వెళ్లడం ఇష్టం లేకనే కిడ్నాప్ కథ చెప్పినట్లు.. వెల్లడించిందని ఎస్సై తెలిపారు. కిడ్నాప్ కలకలం జిల్లా వ్యాప్తంగా చర్చ కాగా కొద్ది సమయంలోనే ప్రచారానికి పోలీసుల అడ్డుకట్ట వేశారు. అయితే సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొనే అవకాశాలు ఉన్నందున తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఎస్సై విజ్ఞప్తి చేశారు. ఇటీవల బయ్యారంలో వరుస చోరీలు చోటు చేసుకోవడానికి సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసులు త్వరితగతిన ఛేదించేఓ దుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నాప్ కలకం … జరిగిన అసత్య ప్రచారం పోలీసులకు తలనొప్పిగా మారింది.

సెల్ ఫోన్ ఎఫెక్ట్..!

బడికి వెళ్లడం ఇష్టం లేని విద్యార్థిని కిడ్నాప్ హైడ్రామాను సృష్టించడం సెల్ ఫోన్ చూడడమే కారణమని తెలుస్తుంది. ఖాళీగా ఉన్న సమయాల్లో సెల్ఫోన్లో యూట్యూబ్, తదితర యాపులు అనేక సంఘటన చూడటంతోనే ఇలాంటి సంఘటకు పాల్పడి ఉంటుందని వాదనలు వినపడుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments