Friday, September 20, 2024
Homeక్రైమ్స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి

స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి

జనగామ జిల్లాలో విషాదం..
స్పాట్ వాయిస్, జనగామ: జనగామ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఏడేళ్ల బాలుడు బస్సు వెనక టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. జనగామ మండలం అడవి కేశవాపురం గ్రామానికి చెందిన బానోతు వరుణ్ తేజ్ (07) పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో ఒకటో చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాల ముగిసిన అనంతరం గ్రామంలో పిల్లలను దిగబెట్టేందుకు వెళ్లగా.. స్కూల్ బస్సు టైర్ల కింద పడి వరుణ్ తేజ్ ప్రాణాలు వదిలాడు. బస్సు డ్రైవర్ మహేందర్ సదరు బాలున్ని గమనించకుండా బస్సును వెనక్కి తీయగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కగానొక్క కొడుకు ప్రమాదంలో మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకొన్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments