Wednesday, April 9, 2025
Homeలేటెస్ట్ న్యూస్స్కూళ్లు ప్రారంభమయ్యేనా..?

స్కూళ్లు ప్రారంభమయ్యేనా..?

తెలంగాణలో పెరుగుతున్న కొవిడ్ కేసులు
శుక్రవారం ఒక్కరోజు 155 కేసులు
రీ ఓపెన్ పై తర్జనభర్జన పడుతున్న సర్కార్
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: రాష్ర్టంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వైద‍్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 155 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇటు ప్రజలను అటు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే సోమవారం నుంచి పాఠశాలలు తెర్చుకోనున్న నేపథ్యంలో గుబులు రెట్టింపు అయింది. ఈనేపథ్యంలో విద్యా సంస్థల రీ ఓపెన్ పై ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. పాఠశాలలకు సెలవులు పొడిగింపు ఉంటుందా..? అనే చర్చ నడుస్తోంది. అయితే, కరోనా వైరస్ పెరిగే ప్రమాదం ఉందని, ముప్పు ఇంకా పోలేదని ఇప్పటికే డీహెచ్ చెప్పడంతో విద్యా సంస్థలు తెరుచుకోవడంపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో పాఠశాలల ప్రారంభంపై ఆదివారం సాయంత్రానికి ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments