Sunday, April 20, 2025
Homeక్రైమ్ఉరేసుకుని విద్యార్థి బలవన్మరణం

ఉరేసుకుని విద్యార్థి బలవన్మరణం

వరంగల్ కాశీబుగ్గలో విషాదం
స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ కాశీబుగ్గలో విషాదం నెలకొంది. స్థానిక రాములవారి వీధిలో నివాసముంటున్న మడిపల్లి లక్ష్మి-నాగరాజు దంపతుల కుమారుడు సాత్విక్(13) గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే సాత్విక్ ను వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అయితే విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, మడిపల్లి లక్ష్మి-నాగరాజు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, ఇందులో సాత్విక్ అందరికంటే చిన్నవాడు. సాత్విక్ కాశీబుగ్గ గుడి సమీపంలోని నరేంద్ర నగర్ హైస్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడని, ప్రతి రోజు ఉదయం సాయంత్రం కాశీబుగ్గ, ఓసిటీ ప్రాంతాల్లో, పలు దుకాణాల్లో పూలు అమ్ముతూ కుటుంబానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. చిన్నప్పటినుంచే సాత్విక్ చాలా చురుకుగా ఉండేవాడని, కాలనీవాసుల నోట్లో నాలుకగా ఉండే సాత్విక్ చనిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments