Tuesday, May 20, 2025
Homeజిల్లా వార్తలుమహిళ సాధికారత సదస్సుకు సర్పంచ్ యాద రాజేశ్వరి

మహిళ సాధికారత సదస్సుకు సర్పంచ్ యాద రాజేశ్వరి

స్పాట్ వాయిస్, దామెర: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో ఈ నెల 19వ తేదీ నుంచి 21వరకు రాష్ట్రస్థాయిలో నిర్వహించే మహిళ సాధికారత సదస్సుకు మండలంలోని దుర్గంపేట సర్పంచ్ పురాణం యాద రాజేశ్వరి ఈశ్వర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ పురాణం యాద రాజేశ్వరి ఈశ్వర్ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలను అమలు చేస్తు్న్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అన్నారు. మహిళల అభివృద్ధి, సంరక్షణ చర్యలపై రాష్ట్రస్థాయిలో నిర్వహించే మహిళా సాధికారత సదస్సులో పలు అంశాలను ప్రస్తావించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే మహిళా సాధికారిత సదస్సుకు తను ఎంపిక కావడానికి సహకరించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గ్రామ ప్రజలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments