Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్పోలీసులను ఆశ్రయించిన సర్పంచ్ నవ్య..

పోలీసులను ఆశ్రయించిన సర్పంచ్ నవ్య..

ఎమ్మెల్యే రాజయ్యతోపాటు భర్తపై ఫిర్యాదు..
లైంగిక వేధింపుల ఘటనలో మరో కీలక పరిణామం
స్పాట్ వాయిస్, స్టేషన్ ఘన్ పూర్: ఎమ్మెల్యే రాజయ్య , సర్పంచ్ నవ్య ఎపిసోడ్ లో మరో కీలకం పరిణామం జరిగింది. ఎమ్మెల్యే రాజయ్యతో పాటు, భర్త ప్రవీణ్‌పై కేసు పెట్టేందుకు నవ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఎమ్మెల్యే రాజయ్యతో పాటు, భర్త ప్రవీణ్‌, ఎమ్మెల్యే పీఏ, ధర్మసాగర్‌ ఎంపీపీపైనా ఆమె ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ధర్మసాగర్‌ మండలం జానకీపురం సర్పంచ్‌ నవ్య రాజయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ కొద్ది రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు మంతనాలతో చల్లారినట్లే అనిపించిన లొల్లి రెండు రోజులుగా మళ్లీ తీవ్రమైంది. రాజయ్య పాల్పడిర వేధింపులకు సంబంధించి ఆడియో రికార్డులు ఇవ్వాలంటూ అనుచరులతో ఎమ్మెల్యే తనపై తీవ్ర ఒత్తిడి చేయిస్తున్నారని నవ్య ఆరోపించారు. గ్రామాభివృద్ధి కోసం ఇస్తానన్న రూ.20 లక్షలు, ఇవ్వకపోగా అప్పుగా తీసుకున్నట్లుగా పత్రంపై సంతకం పెట్టాలని తనపై తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే వర్గం ఒత్తిడికి తన భర్త తలొగ్గారని, సంతకం పెట్టాలంటూ తనపై ఆయన సైతం ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఒత్తిడి తెస్తున్న ఎమ్మెల్యే రాజయ్య, ఆయన పీఏ, మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఓ మహిళతో పాటు వారి ప్రలోభాలకు లోనై తన మీద ఒత్తిడి తెస్తున్న భర్తను కూడా వదిలి పెట్టనని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయితే వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే మహిళా కమిషన్ ను ఆశ్రయిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments