Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలుసర్పంచ్ యాద రాజేశ్వరి ఈశ్వర్ కి సన్మానం

సర్పంచ్ యాద రాజేశ్వరి ఈశ్వర్ కి సన్మానం

సర్పంచ్ యాద రాజేశ్వరి ఈశ్వర్ కి సన్మానం
స్పాట్ వాయిస్, దామెర : తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో ఈ నెల 19 నుంచి 21 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా సాధికారత సదస్సులో మండల సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి, దుర్గంపేట సర్పంచ్ పురాణం యాద రాజేశ్వరి ఈశ్వర్ పాల్గొని విజయవంతంగా అవగాహన సదస్సు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో సర్పంచ్ పురాణం యాద రాజేశ్వరి ఈశ్వర్ ను సత్కరించి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర్, వైస్ ఎంపీపీ జాకీర్ ఆలీ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గట్ల విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ జన్ను మల్లయ్య, సర్పంచులు కుక్క శ్రావణ్య అనిల్, రాణి రఘుపతి రెడ్డి, రాజేందర్, సాంబయ్య, శ్రీనివాస్, రజిత సత్యం, ఇంచార్జ్ సర్పంచ్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments