హన్మకొండ కోర్టుకు బండి సంజయ్..!
భారీగా మోహరించిన పోలీసులు
పాలకుర్తిలో వైద్య పరీక్షలు..
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను గాజుల రామారం పోలీస్ స్టేషన్ నుంచి వరంగల్ జిల్లాకు తరలించారు. ముందుగా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బండికి వైద్య పరీక్షలు చేయించారు. పాలకుర్తి ఆస్పత్రికి సంజయ్ ని తీసుకొస్తున్నారనే సమాచారం మేరకు బీజేపీ శ్రేణులు భారీగా మోహరించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. పోలీసులు ఆయనను హన్మకొండ కోర్టులో హాజరుపర్చనున్నట్లు సమాచారం. ఈ మేరకు కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
తరలింపుపై స్పష్టత కరువు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తరలింపుపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయనను ఎక్కడకు తరలిస్తున్నారనే దానిపై పోలీసులు నోరు మెదపడం లేదు. భారీ బందోబస్తు మధ్య కార్లను మారుస్తూ బండి సంజయ్ను పోలీసులు తిప్పుతున్నారు. అయితే జనగామ జిల్లా పెంబర్తి వద్దకు చేరిన బండి సంజయ్ కాన్వాయ్ను బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు లాఠీచార్జ్ చేసి బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. బండి సంజయ్ను మరో వాహనంలోకి మార్చి అక్కడి నుంచి తరలించారు. వరంగల్ హైవే నుంచి జనగామ సర్వీస్ రోడ్డుకు బండి సంజయ్ కాన్వాయ్ను మళ్లించారు. అయితే ఆయనను ఎక్కడకు తరలిస్తున్నారనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం పాలకుర్తి వర్ధన్నపేటలో బండి సంజయ్ కాన్వాయ్ వెళ్తోంది. బండి సంజయ్ తరలింపులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపట్ల బీజేపీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు. బండి సంజయ్ను ఎక్కడికి తరలిస్తున్నారో చెప్పాలని కమలం పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు.
Recent Comments