Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలుగుండ్ల సింగారం సగర సంఘం కమిటీ ఎన్నిక

గుండ్ల సింగారం సగర సంఘం కమిటీ ఎన్నిక

గుండ్ల సింగారం సగర సంఘం కమిటీ ఎన్నిక

స్పాట్ వాయిస్ , హన్మకొండ : హన్మకొండ జిల్లా పరిధిలోని గుండ్లసింగారం సగర సంఘం కమిటీని ఆ సంఘ సభ్యులు జిల్లా ఎన్నికల అడహక్ కమిటీ కన్వీనర్ సీత కమలాకర్ రావు, కో- కన్వీనర్లు వడ్లకొండ కుమార స్వామి, సీత రమేష్ కుమార్, కుర్మిండ్ల సదానందం ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొడిపాక రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా నీలం లక్ష్మయ్య, కోశాధికారిగా కట్ట రాజు ఎన్నికయ్యారు. అలాగే గౌరవ అధ్యక్షుడిగా దుంపల మహేందర్, గౌరవ సలహాదారుడిగా తాడిశెట్టి శ్రీధర్, ఉపాధ్యక్షుడిగా చిదురాల రాజు, కొడిపాక సన్నిత్, సుతారి భిక్షపతి, సహాయ కార్యదర్శులుగా దుంపల రవీందర్, వీరగంటి నారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎంజాల రాజమల్లయ్య, కుర్మిండ్ల రాజేందర్, ఎంజాల సుమన్, దుంపల మధు, కార్యవర్గ సభ్యులుగా గుంటి రాజేందర్, దుంపల శివకుమార్ తో పాటు పలువురిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి , సంఘ సభ్యులు మల్లికాంబ, శశికిరణ్, ఆంజనేయులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments