Sunday, May 19, 2024
Homeక్రైమ్బైక్ ను ఢీకొన్న బస్సు.. తండ్రీకొడుకు మృతి

బైక్ ను ఢీకొన్న బస్సు.. తండ్రీకొడుకు మృతి

చిన్నగూడూరు మండలంలో విషాదం
స్పా్ట్ వాయిస్, క్రైమ్ : మానుకోట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ స్టేజీ ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై బైక్ ను బస్సు ఢీకొంది. ఈ ఘటనలో చిన్నగూడూరు మండలానికి చెందిన తండ్రీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు బైక్ ను కొంతదూరం లాక్కెళ్లడంతో ఆ ఇద్దరి మృతదేహాలు చిధ్రమయ్యాయి. కాగా, మృతులు చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామానికి చెందిన జక్కుల హరీష్, అతడి కుమారుడిగా గుర్తించారు. పోలీసులు ప్రమాద ఘటనపై విచారణ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments