Sunday, May 19, 2024
Homeక్రైమ్ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీ

ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీ

ప్రయాణికులకు తీవ్ర గాయాలు
భూపాలపల్లిలో ఆస్పత్రికి తరలింపు
స్పాట్ వాయిస్, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవి మల్లంపల్లి క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీకొన్నాయి. కాళేశ్వరం నుంచి పరకాలకు వస్తుండగా.. అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం బస్సును ఢీకొంది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు భూపాలపల్లిలోని వంద పడకల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారిలో కొందరి పరిస్థితి ఇబ్బందిగా ఉందని డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments