Friday, May 23, 2025
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

స్పాట్ వాయిస్, మహబూబాబాద్( మరిపెడ): స్కూల్ బస్సు బైకు ఎదురుగా ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బురాన్ పురం గ్రామ శివారు జాతీయ రహదారి 365 పై శనివారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మరిపెడ మండలం గుండేపూడి గ్రామానికి చెందిన బాధవత్ శంకర్ తానంచర్ల నుంచి బురహాన్ పురం వైపునకు వస్తున్నాడు. అదేవిధంగా మరిపెడ మరిపెడలోని ఒక ప్రైవేటు స్కూలుకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకొచ్చేందుకు తానం చర్ల వైపునకు వెళ్తోంది. ఈ క్రమంలో  బురహాన్ పురం శివారులో  శంకర్ బైకు నేరుగా స్కూల్ బస్సు కు వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుడు అతివేగంగా వచ్చి బస్సును ఢీ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments