స్పాట్ లోనే ముగ్గురు మృతి..
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకోంది. స్టేషన్ ఘన్ పురం మండలం రాఘవపురం గ్రామ సమీపంలో కారు లారీ ఢీ కొంది. ఈ ప్రమాదలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కారు హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి సబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments