Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుపోరాడి హక్కులను సాధించుకోవాలి

పోరాడి హక్కులను సాధించుకోవాలి

స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: మేడే సందర్భంగా వర్ధన్నపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ కార్మిక నాయకులు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం పోరాడాలన్నారు. ఐక్యంగా ఉంటూ హక్కులను సాధించుకోవాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని అన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షుడు సంజీవ , కుమార్ స్వామి ,రాజు యాకయ్య, కుమారు, స్వామి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments