Monday, April 21, 2025
Homeజిల్లా వార్తలుఅక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

వ్యక్తిపై కేసు నమోదు

స్పాట్ వాయిస్ నర్సంపేట : నర్సంపేట పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేశారు. నర్సంపేట పట్టణ సీఐ రమేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం…
నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో ఉట్కూరు సాంబయ్య అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు ఆయన ఇంటిపై దాడి చేసి ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని
సాంబయ్య పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ దాడిలో ఎస్సై రాంచరణ్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments