Friday, September 27, 2024
Homeకెరీర్రెండు రోజుల్లో ఎంసెట్ ఫలితాలు..!

రెండు రోజుల్లో ఎంసెట్ ఫలితాలు..!

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: ఎంసెట్ ఫలితాలు రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఎంసెట్ కమిటీ గురువారం ఫలితాలను విశ్లేషించి ఆమోదించనుంది. గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్… 30, 31న అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. 1,56,812 మంది ఇంజినీరింగ్​లో ప్రవేశాల కోసం, 80,575 మంది విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల కోసం పరీక్షలు రాశారు. ప్రాథమిక కీ విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. తుది కీతో పాటు ఫలితాలను ఎంసెట్ కమిటీ విశ్లేషించి నిర్ణయం తీసుకోనుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమయాన్ని బట్టి ఈ నెల 12 లేదా 13న ఫలితాలను ప్రకటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments