Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుఐనవోలు మల్లన్నను దర్శించుకున్న ప్రజాప్రతినిధులు

ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న ప్రజాప్రతినిధులు

స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని ఆదివారం రాజ్య సభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ చీప్ విప్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వీరిని శాలువాతో సత్కరించిన వేదపండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీరెల్లి భరత్ కుమార్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితా యాదవ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ, నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్ రావు,ఆలయ ఈఓ నాగేశ్వరరావు, దేవస్థానం మాజీ చైర్మన్ మునిగాల సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments