Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుఓటమి భయంతోనే దాడులు

ఓటమి భయంతోనే దాడులు

ఓటమి భయంతోనే దాడులు
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి

స్పాట్ వాయిస్, మునుగోడు-టీఆర్ఎస్ గుండాలు విసిరే రాళ్లే రేపటి బీజేపీ విజయానికి, ప్రభుత్వ ఏర్పాటుకు పునాది రాళ్లు అవుతాయని, మునుగోడు లో ఓటమి భయం తోనే దాడులు జరుగుతున్నాయని, దాడులతో ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని వారు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల గుండెల్లో ఉన్న నాయకులను రాళ్ల దాడులతో చెరిపేయ్యలేరన్నారు. ఈటలపై రోజురోజుకు పెరుగుతున్న ప్రజాభిమానాన్ని చూసి కన్నుకుట్టి తట్టుకోలేక కాన్వాయ్ పై దాడి చేశారన్నారు. ప్రజలు పువ్వులు జల్లుతుంటే, కేసీఆర్ బానిసలు రాళ్ళు రువ్వుతున్నారని దుయ్యబట్టారు. ఈటల మౌనం గోడకు వేలాడదీసిన తుపాకీ లాంటిదని, ఆయన మౌనాన్ని, సహనాన్ని అలుసుగా తీసుకుంటే టీఆర్ఎస్ గుండాలు, కేసీఆర్ బానిసలు తెలంగాణలో రోడ్ల మీద తిరగలేరని హెచ్చరించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ఆయనపై అభాండాలు మోపి పార్టీ నుంచి బయటకి పంపారన్నారు. అప్పటి నుంచి ఈటలపై పెరుగుతున్న ప్రజాభిమానం చూసి తట్టుకోలేకనే చిల్లర వేషాలు వేస్తున్నారన్నారు. ఆ పల్లా కాదు ఫైళ్ళ రాజేశ్వర్ రెడ్డి కెసిఆర్ పెద్ద పాలేరు కావాలని లీడర్ల సాటు దొంగ ప్రజా నాయకుడి పై దాడి చేసి చరిత్ర హేనుడిగా మిగిపోతాడన్నారు. అలాంటి ఫైళ్లు మోసే లీడర్లు, గులాం గిరి గాళ్ళు అడ్డం పొడుగు పండి పబ్బతి పట్టినా ఈటల లాంటి నాయకుడిని ఏమీ చేయల్లేరన్నారు. ఈటలపై ప్రజలకున్న అభిమానం మీ చిల్లర వేషాలతో రెట్టింపు అవుతుంది తప్ప తగ్గదు అని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments