Monday, September 23, 2024
Homeతెలంగాణరాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల సాయం

రాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల సాయం

రాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల సాయం

స్పాట్ వాయిస్ , నర్సంపేట: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో వరంగల్‌ జిల్లాకు చెందిన దామెర రాకేశ్‌ మృతికి సంతాపం తెలిపారు. రాకేశ్​ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. రాకేశ్‌ కుటుంబంలో అర్హులైన వారికి అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల రాకేశ్‌ మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ బిడ్డలను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments