Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలురైతుబంధు దరఖాస్తులకు ఆహ్వానం

రైతుబంధు దరఖాస్తులకు ఆహ్వానం

రైతుబంధు దరఖాస్తులకు ఆహ్వానం
స్పాట్ వాయిస్, దామెర: మండలంలోని కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి శివలీల తెలిపారు. ఆయా గ్రామాల్లోని క్లస్టర్ కు సంబంధించిన రైతు వేదికలో రైతుబంధు దరఖాస్తుతోపాటు పట్టాదార్ పాస్ బుక్ లేదా (ఆఫీసు కాపీ), ఆధార్ కార్డు,బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన జిరాక్స్ కాపీలను జత చేయాలన్నారు. ఇంతకుముందు పాస్ బుక్కు ఉండి అందులో ఏమైనా భూమి కొనుగోలు, అమ్మకాలు జరిగిన ఇంతకుముందు ఉన్న పాస్ బుక్ లో అప్డేట్ చేస్తారని చెప్పారు. కొత్తగా దరఖాస్తు అవసరం లేదన్నారు. అలాగే వానాకాలం 2022-2023 సీజన్లో బ్యాంకు అకౌంట్ మార్చుకోవాలనుకున్న రైతులు తమ పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డ్,బ్యాంకు అకౌంటు(మార్చుకునేది)జిరాక్స్ కాపీలను మే 25వ తేదీ లోపు సమర్పించాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి శివలీల తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments